మహిళా సాధికారతకు నాబార్డు చేయూత

ABN , First Publish Date - 2020-03-12T08:36:09+05:30 IST

నాబార్డు స్వయం సహాయక సంఘాలకు చేయూతనిచ్చి మహిళా సాధికారతకు కృషి చేస్తోందని నాబార్డు

మహిళా సాధికారతకు నాబార్డు చేయూత

నాబార్డు డీడీఎం బీవీఎస్‌ రామప్రభు 

ఏలూరు, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : నాబార్డు స్వయం సహాయక సంఘాలకు చేయూతనిచ్చి మహిళా సాధికారతకు కృషి చేస్తోందని నాబార్డు డీడీఎం బీవీఎస్‌ రామప్రభు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాబార్డు కార్యాలయంలో బుధవారం స్త్రీల సామాజిక, ఆర్థిక ప్రగతికి ఆద ర్శంగా నిలిచిన స్వయం సహాయక సంఘాల మహిళలకు అభిన ందన కార్యక్రమం నిర్వహించారు.


రాష్ట్రంలో రుణాల చెల్లింపు 98 శాతంగా ఏపీ తొలిస్థానంలో ఉందన్నారు.డీఆర్‌డీఏ పీడీ ఉదయ భాస్కర్‌ మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల న్నారు.సన్మాన గ్రహీత మహిళా కమిషన్‌ సభ్యురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళా కమిషన్‌ మహిళల హక్కుల రక్షణకే పని చేస్తోందన్నారు.ఎక్సైజ్‌ ఉప కమిషనర్‌ అనసూయా దేవిని సత్కరించారు.కార్యక్రమంలో డీసీసీబీ సీఈవో వీవీ ఫణి కుమా ర్‌,డీసీసీబీ జీఎంశ్రీనివాస్‌,ఎల్‌డీఎం రామచంద్రరావుపాల్గొన్నారు. 

Updated Date - 2020-03-12T08:36:09+05:30 IST