సీఎం జగన్‌కు ఎంపీ రఘురాజు మరో లేఖ

ABN , First Publish Date - 2020-07-14T18:34:21+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు.

సీఎం జగన్‌కు ఎంపీ రఘురాజు మరో లేఖ

ఏలూరు : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో లేఖ రాశారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని లేఖలో రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో 20లక్షల 64 వేల భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారని ఆయన తెలిపారు. వారిలో 10లక్షల 66 వేల మంది కార్మికుల పేర్లను మాత్రమే ఆధార్‌తో లింక్ చేశారని.. మిగిలిన వారి పేర్లు వెంటనే లింక్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కాలంలో బిల్డర్స్ నుంచి సంక్షేమ నిధి రూపేణా రూ. 1364 కోట్లు వసూలు చేసిందన్నారు. అయితే ఇప్పటి వరకూ 330 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్న విషయాన్ని రఘురాజు నిశితంగా లేఖలో వివరించారు. మిగిలిన వెయ్యి కోట్ల నిధుల నుంచి ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి 5 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని జగన్‌కు రాసిన లేఖలో రఘురాజు పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-14T18:34:21+05:30 IST