బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎంపీ భరత్
ABN , First Publish Date - 2020-06-11T10:37:55+05:30 IST
బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజ మండ్రి ఎంపీ ఎం.భరత్ తెలిపారు.

ఉండ్రాజవరం, జూన్ 10: బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజ మండ్రి ఎంపీ ఎం.భరత్ తెలిపారు. పాలంగిలోని బీసీ సామాజిక భవనంలో బుధవారం ఆత్మీయ అభినందన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయ న్నారు. బీసీ నాయకులు ఎంపీ భరత్ను సత్కరించారు. బీసీ నాయకుడు బొల్లా శ్రీనివాస్, గూడూరి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.