పెండింగ్ సమస్యలపై దృష్టి : ఎమ్మెల్యే ముదునూరి
ABN , First Publish Date - 2020-11-08T04:46:53+05:30 IST
నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న అన్ని సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ప్రసాదరాజు అన్నారు.
![పెండింగ్ సమస్యలపై దృష్టి : ఎమ్మెల్యే ముదునూరి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020110711152295/11072020231645n38.jpg)
నరసాపురం టౌన్, నవంబరు 7: నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న అన్ని సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ప్రసాదరాజు అన్నారు. పట్టణంలోని 29వార్డులో పాదయాత్ర నిర్వహించారు. ఆనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మా ట్లాడుతూ అన్ని వార్డులకు పుష్కలంగా మంచినీటిని అందిస్తామన్నారు. కొత్త పైప్లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. పెండ్ర వీరన్న, ఏంఎసీ చైర్మన్ స్వామి, శంకర్, కామన బుజ్జీ, వైఎస్ బాబులు, గోరు సత్తిబాబు, ఎం సత్యనారాయణ ఉన్నారు.