అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే లక్ష్యం
ABN , First Publish Date - 2020-06-06T10:14:32+05:30 IST
రాష్ట్రంలోని అర్హత గల పేదలందరికి ఉచితంగా ఇళ్లు ఇవ్వడమే సీఎం జగన్మోహనరెడ్డి లక్ష్యమని మంత్రి తానేటి వనిత
కొవ్వూరు, జూన్ 5 : రాష్ట్రంలోని అర్హత గల పేదలందరికి ఉచితంగా ఇళ్లు ఇవ్వడమే సీఎం జగన్మోహనరెడ్డి లక్ష్యమని మంత్రి తానేటి వనిత అన్నారు. కొవ్వూరులో శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఇళ్ల స్థలాలకు ఏ ఒక్కరూ ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదన్నారు. ప్రభుత్వం 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించాలని ధృడ సంకల్పంతో ఉందని, అవినీతికి తావు లేకుండా కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభు త్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇళ్ల స్థలాలకు డబ్బులు వసూలు చేస్తున్నారని తమ వద్దకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.