దళిత యువకులపై పోలీసుల దాడి అమానుషం

ABN , First Publish Date - 2020-08-08T09:31:06+05:30 IST

దళిత యువకులపై జంగారెడ్డిగూడెం పోలీసుల దాడి అమానుషమని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ..

దళిత యువకులపై పోలీసుల దాడి  అమానుషం

పాలకొల్లు అర్బన్‌, ఆగస్టు 7 : దళిత యువకులపై జంగారెడ్డిగూడెం పోలీసుల దాడి అమానుషమని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మాలమహానాడు అధ్యక్షుడు నల్లి రాజేష్‌ డిమాండ్‌ చేశారు. పోలీసుల దాడికి గురైన యువకులతో కలిసి పాలకొల్లులో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 2న రాత్రి జంగారెడ్డిగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రి వద్ద జంగారెడ్డిగూడెం మండల మాలమహానాడు నాయకుడు గంజి వినోద్‌, అతని మిత్రులను ఆసుపత్రికి దూరంగా ఉన్నప్పటికీ ఆసుపత్రిలో అల్లరి చేశారనే అభియో గం పై కొట్టుకుంటూ స్టేషన్‌కు తీసుకువెళ్లారన్నారు. వారిపై పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారని రాజేశ్‌ తెలిపారు. పోలీసులను సస్పెండ్‌ చేయడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాజేశ్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-08-08T09:31:06+05:30 IST