భార్యతో గొడవ.. పీక నులిమి చంపేసిన భర్త.. అంతా ప్రేయసి కోసమే..!
ABN , First Publish Date - 2020-08-08T19:28:55+05:30 IST
ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న భార్యను పీక నులిమి చంపేశాడో కసాయి భర్త. నిడమర్రు పోలీసులు వారం రోజుల్లో కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు.ఈ మేరకు గణపవరం సీఐ డేగల
ప్రియురాలి కోసం భార్యను చంపేశాడు
నిడమర్రులో ఘటన.. నిందితుడి అరెస్టు
నిడమర్రు(పశ్చిమ గోదావరి జిల్లా): ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న భార్యను పీక నులిమి చంపేశాడో కసాయి భర్త. నిడమర్రు పోలీసులు వారం రోజుల్లో కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు.ఈ మేరకు గణపవరం సీఐ డేగల భగవాన్ ప్రసాద్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. నిడమర్రుకు చెందిన వీరవరపు అయ్యప్పకు 2016వ సంవత్సరంలో కొప్పర్రుకు చెందిన నాగవెంకట రమాదేవి(24)తో వివాహమైంది. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి. అయ్యప్ప వేరే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని రమాదేవిని తరచు వేధించేవాడు. తన భార్య అడ్డుతొలగించుకుని ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనుకుడేవాడు. ఇదిగా ఉండగా జూలై 31వ తేదీన భార్యతో గొడవ పడి ఆమె పీక నులిమి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఫ్యాన్కు చీరతో కట్టి ఆత్మహత్య చేసుకున్నట్టు సృష్టించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు వారం రోజుల్లో కేసును ఛేదించారు. జిల్లా ఎస్పీ నారాయణ నాయక్, డీఎస్పీ దిలీప్కిరణ్ పర్యవేక్షణలో ఎస్ఐ హెచ్.నాగరాజు, సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారన్నారు.