కన్నుల పండువగా శ్రీపుష్పయాగం

ABN , First Publish Date - 2020-11-03T05:42:26+05:30 IST

ద్వారకా తిరుమల చినవెంకన్న నిజ ఆశ్వయుజ మాస కల్యాణో త్సవాలు సోమవారం రాత్రి శ్రీపుష్పయాగంతో ముగిశాయి.

కన్నుల పండువగా శ్రీపుష్పయాగం
తొళక్కం వాహనంపై ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లు

ముగిసిన చిన వెంకన్న కల్యాణోత్సవాలు

ద్వారకాతిరుమల, నవంబరు 2: ద్వారకా తిరుమల చినవెంకన్న నిజ ఆశ్వయుజ మాస కల్యాణో త్సవాలు సోమవారం రాత్రి శ్రీపుష్పయాగంతో ముగిశాయి. సోమ వారం ఉదయం స్వామి, అమ్మవార్లను తొళక్కం వాహనంపై ఆశీనులు గావించి ప్రత్యేక పూజలు చేసి హారతు లిచ్చారు. అనంతరం కోవెల ఉత్సవం నిర్వహించారు. ఆలయాన్ని వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు పెద్దింటి రాంబాబు, అర్చకులు శ్రీపుష్పయాగ కార్యక్రమాన్ని ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. ఈవో భ్రమరాంబ, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-03T05:42:26+05:30 IST