వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి

ABN , First Publish Date - 2020-12-11T05:39:20+05:30 IST

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు అన్నారు.

వృత్తి నైపుణ్యాలను  పెంచుకోవాలి
ఏలూరులో జరిగిన పోలీసు మీట్‌లో జాగిలం విన్యాసం

డ్యూటీ మీట్‌లో డీఐజీ మోహనరావు

ఏలూరు క్రైం, డిసెంబరు 10 : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు అన్నారు. రేంజ్‌ పరిధిలోని తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలతోపాటు రాజమహేంద్రవరంలలో పనిచేసే పోలీస్‌ సిబ్బందికి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన డ్యూటీ మీట్‌ను అడిషినల్‌ ఎస్పీ సుబ్బరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ నేర దర్యాప్తులో పోలీస్‌ సిబ్బంది ఫోరెన్సిక్‌ సైన్స్‌, లా అండ్‌ ఆర్డర్‌, పోలీస్‌ జాగిలాల పనితీరులో  ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి జనవరి 7 నుంచి 11 వరకూ తిరుపతిలో జరిగే స్టేట్‌ లెవెల్‌ డ్యూట్‌ మీట్‌కు పంపిస్తామన్నారు. గతంలోనూ రేంజ్‌ పరిధిలో అనేక మంది అవార్డులు సాధించారన్నారు. ఎస్పీ కె.నారాయణ నాయక్‌, అదనపు ఎస్పీ ఏవీ సుబ్బ రాజు, ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌, డీఎస్పీలు కె.ప్రభాకరరావు, జీవీఎస్‌ పైడేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T05:39:20+05:30 IST