పాత్రికేయుల సమస్యలపై సీఎంతో చర్చిస్తా

ABN , First Publish Date - 2020-02-08T12:05:31+05:30 IST

పాత్రికే యుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ డి.శ్రీనాథరెడ్డి పేర్కొన్నారు.

పాత్రికేయుల సమస్యలపై సీఎంతో చర్చిస్తా

ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ డి.శ్రీనాథరెడ్డి

తాడేపల్లిగూడెం రూరల్‌/ ఉండ్రాజవరం,ఫిబ్రవరి 7: పాత్రికే యుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ డి.శ్రీనాథరెడ్డి పేర్కొన్నారు. ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయనను తాడేపల్లిగూడెం, తణుకు ప్రెస్‌క్లబ్‌ సభ్యులు కలుసుకుని తమ సమస్యలు విన్నవించారు. పాత్రికేయుల సమస్యలపై సీఎంతో  చర్చించి నిర్ణయం తీసుకుంటామ న్నారు.గ్రామీణ జర్నలిస్టులకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ఐజేయూ సభ్యుడు దూసనపూడి సోమ సుందర్‌ మాట్లాడుతూ పాత్రికేయుల ఇళ్ల సమస్యకు శాశ్వత పరి ష్కారం చూపించాలని కోరారు.దీనిపై స్పందించిన శ్రీనాథరెడ్డి ఇప్పటికే సీఎంతో చర్చించామని త్వరలోనే జర్నలిస్ట్‌ యూనియన్‌ నాయకులతో చర్చించి ఒక విధానం ప్రకటిస్తామన్నారు.

కార్యక్రమంలో   ఏపీయూ డబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వానపల్లి సుబ్బారావు,తాడేపల్లి గూడెం ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు చిక్కాల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి మైలవరపు రవికిరణ్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగ సురేష్‌, సీనియర్‌ పాత్రికేయుడు  ఎస్‌.గురునాథ్‌,సుధాకర రెడ్డి,రొక్కం కిషోర్‌, యడ్లపల్లి మురళి, చిట్యాల రాంబాబు, మోటుపల్లి శ్రీనివాసరావు, కొడమంచిలి కృష్ణ, జి.ఏసుబాబు, సాయి, ఎం.సత్యనారాయణరెడ్డి, ఆంజనేయులు, సీహెచ్‌వీ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-08T12:05:31+05:30 IST