కేసులు పెండింగ్‌లో ఉంచవద్దు

ABN , First Publish Date - 2020-12-15T06:18:28+05:30 IST

పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెండింగ్‌లో లేకుండా సత్వరమే పరిష్కరించడానికి కృషి చేయాలని తాళ్లపూడి ఎస్‌ఐ సతీశ్‌ను డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు.

కేసులు పెండింగ్‌లో ఉంచవద్దు

 డీఐజీ కేవీ మోహనరావు

తాళ్లపూడి, డిసెంబరు 14: పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెండింగ్‌లో లేకుండా సత్వరమే పరిష్కరించడానికి కృషి చేయాలని తాళ్లపూడి ఎస్‌ఐ సతీశ్‌ను డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు. సోమవారం తాళ్లపూడి పోలీస్‌ స్టేషన్‌కు విచ్చేసిన ఆయన  రికార్డులను పరిశీలించి  సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  నాటుసారా తయారీని అరికట్టడానికి ఎస్‌ఈబీ అధికారులతో దాడులు ముమ్మరం చేయాలన్నారు. ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట కొవ్వూరు రూరల్‌ సీఐ సురేశ్‌, ఎస్‌ఐ సతీశ్‌ ఉన్నారు.

 

Updated Date - 2020-12-15T06:18:28+05:30 IST