మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు
ABN , First Publish Date - 2020-12-20T05:47:04+05:30 IST
అమరావతిలో రాజధాని రైతులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు ఏడాది దాటిన సందర్భంగా మంగపతిదేవిపేట గ్రామంలో రాజధాని రైతులకు మద్దతుగా శనివారం నిరసన వ్యక్తం చేశారు.

కొయ్యలగూడెంలో రాజధాని రైతులకు మద్దతుగా ఆందోళన
కొయ్యలగూడెం, డిసెంబరు 19: అమరావతిలో రాజధాని రైతులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు ఏడాది దాటిన సందర్భంగా మంగపతిదేవిపేట గ్రామంలో రాజధాని రైతులకు మద్దతుగా శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు గన్నమని రత్నాజీ, సాగుబోయిన సత్యనారాయణలు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏతూరి సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, బొట్టా శ్రీను, అనీల్కుమార్, మైనం శ్రీనివాస్, పేరుబోయిన వీరాస్వామి, వెంకటేశ్వరరావు, కండెల్లి సంసోను, కండెల్లి విశ్వేశ్వరరావు, మహాలక్ష్మయ్య, సింహాచలం, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.