ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం
ABN , First Publish Date - 2020-07-08T11:19:13+05:30 IST
పోలవరం మండల తహసీల్దారు కార్యాలయంలో పలు ధ్రువీకరణ పత్రాల జారీలో అధికా రులు, సిబ్బంది జాప్యం చేయడంతో వల్ల తాము ఉద్యోగావ కాశాలు
ఆందోళనలో ఉద్యోగార్థులు
పోలవరం, జూలై 7: పోలవరం మండల తహసీల్దారు కార్యాలయంలో పలు ధ్రువీకరణ పత్రాల జారీలో అధికా రులు, సిబ్బంది జాప్యం చేయడంతో వల్ల తాము ఉద్యోగావ కాశాలు కోల్పోయే పరిస్థితులు ఎదురవుతున్నాయని పలు వురు నిరుద్యోగులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థులు కుల ధ్రువీకరణ,లోకల్ సర్టిఫికెట్ తదితర పత్రాలకు కార్యాల యం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ధ్రువపత్రాలు మంజూరు కావడంలేదని వాపోయారు. ఇకనైనా ఉద్యోగులు అందుబా టులో ఉండాలని కోరారు.