యర్నగూడెం వస్త్ర దుకాణంలో చోరీ
ABN , First Publish Date - 2020-11-08T05:07:49+05:30 IST
మండలంలోని యర్నగూడెం వస్త్ర దుకాణంలో చోరీ జరిగినట్టు పోలీసులు తెలిపారు.
![యర్నగూడెం వస్త్ర దుకాణంలో చోరీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
దేవరపల్లి, నవంబరు 7: మండలంలోని యర్నగూడెం వస్త్ర దుకాణంలో చోరీ జరిగినట్టు పోలీసులు తెలిపారు. యర్నగూడెం గ్రామానికి చెందిన రాజేష్ వస్త్ర దుకాణంలో దుండగులు శుక్రవారం రాత్రి తాళాలు బద్దలు కొట్టి దుకాణం లో ఉన్న రూ. 50 వేల నగదును అపహరించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ స్వామి తెలిపారు.