79 ఎరువుల బస్తాలు స్వాధీనం
ABN , First Publish Date - 2020-11-03T05:43:30+05:30 IST
అక్రమంగా తరలిస్తున్న 79 బస్తాల ఎరువులను కామయ్యపాలెం ఎస్ఈబీ చెక్పో స్టు వద్ద పట్టుకున్న సంఘటన జరిగింది
జీలుగుమిల్లి, నవంబరు 2 : అక్రమంగా తరలిస్తున్న 79 బస్తాల ఎరువులను కామయ్యపాలెం ఎస్ఈబీ చెక్పో స్టు వద్ద పట్టుకున్న సంఘటన జరిగింది. జంగారెడ్డిగూ డెం వైపు నుంచి కామయ్యపాలెం మీదుగా మండలంలో తాటిరాముడుగూడెం, జగన్నాథపురం గ్రామాలకు ట్రాక్టరు పై 79 ఎరువుల బస్తాలు తరలిస్తుండగా కామయ్యపా లెం చెక్పోస్టు వద్ద పోలీస్ సిబ్బంది ఆపారు. అనంతరం ఏవో పార్వతికి సమాచారం అందజేశారు. ఎస్ఐ కె.విశ్వనా ధ్బాబు ఆధ్వర్యంలో అక్కడకు చేరుకుని బిల్లులపై ఆమె ఆరా తీశారు. ఈ–పాస్ బిల్లులు లేకపోవడం, ట్రాక్టరు డ్రైవర్ పొంతనలేని సమాధానం తో వాటిని స్వాధీనం చేసుకుని కామయ్యపాలెం డీసీఎంఎస్ ఎరువుల దుకాణం వద్ద ఉంచినట్టు తెలిపారు. ఏవో పార్వతిని వివరణ కోరగా విచారణ జరిపి కేసు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమం లో వీఆర్వో ఆశోక్, ఏఈవో బాలాజీ ఉన్నారు.