అప్రమత్తంగా ఉండండి : ఎస్పీ

ABN , First Publish Date - 2020-06-25T10:13:10+05:30 IST

కరోనా మహ మ్మారి నుంచి కాపాడుకోవడానికి పోలీసు లు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌ ఒక

అప్రమత్తంగా ఉండండి : ఎస్పీ

ఏలూరు క్రైం, జూన్‌ 24 : కరోనా మహ మ్మారి నుంచి కాపాడుకోవడానికి పోలీసు లు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌ ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీస్‌ సిబ్బం ది, వారి కుటుంబ సభ్యులు ఎంతో అప్రమ త్తంగా ఉండాలని, కరోనా వైరస్‌ వ్యాప్తి చెం దకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రతి పోలీస్‌ స్టేషన్‌లోనూ పీపీఈ కిట్లు, థర్మల్‌ స్కానర్‌, మాస్క్‌లు, గ్లౌజులు, శానిటైజర్లు, ఫేస్‌షీల్డ్‌, టెంపరేచర్‌ గన్‌, పల్స్‌ ఆక్సీమీటర్‌, సిబ్బందిలో వ్యాధి నిరోధక శక్తి పెంచ డానికి  ఔషధాలు అందుబాటులో ఉంచాలన్నారు.


ప్రవేశ ద్వారం వద్ద థర్మల్‌ స్ర్కీనింగ్‌  పరీక్ష నిర్వహించాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే సిబ్బంది అన్ని వేళ ల్లోనూ మాస్క్‌లు, గ్లౌజులు ధరించి ఉండాలని సూచించారు. 50 ఏళ్లు పైబడిన సిబ్బందికి కొవిడ్‌కు సంబంధించిన బందోబస్తులు వేయరాదని సూచించారు. 


జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌  బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర డీజీపీ గౌతంసవాంగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ మేరకు వారికి పుష్పగుచ్ఛాలు అందించారు.

Updated Date - 2020-06-25T10:13:10+05:30 IST