అమర వీరుల స్ఫూర్తితో చట్టాలు రక్షించుకోవాలి

ABN , First Publish Date - 2020-11-07T05:07:24+05:30 IST

అమరవీరుల స్ఫూర్తితో హక్కులు, చట్టాలను పరిరక్షించుకోవాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయ కుడు పి.శ్రీనివాస్‌ తెలిపారు.

అమర వీరుల స్ఫూర్తితో చట్టాలు రక్షించుకోవాలి

బుట్టాయగూడెం, నవంబరు 6: అమరవీరుల స్ఫూర్తితో హక్కులు, చట్టాలను పరిరక్షించుకోవాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయ కుడు పి.శ్రీనివాస్‌ తెలిపారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవా రం రామనర్సాపురం ధర్మన్న స్తూపం వద్ద నాయకులు, గిరిజనులు నివాళు లర్పించారు. పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కుర్సం లత అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యలను గాలికొదిలేసిన ప్రభు త్వాలు కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయన్నారు. నాగ న్నగూడెంలో నాగన్న స్తూపం వద్ద, తూర్పు రేగులకుంటలో అమరవీరుల వర్థంతిసభ నిర్వహించారు. కె.వెంకటేశ్వరావు, కృష్ణ, ముక్కమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-07T05:07:24+05:30 IST