-
-
Home » Andhra Pradesh » West Godavari » 26 th Samme
-
‘26న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి’
ABN , First Publish Date - 2020-11-22T05:14:06+05:30 IST
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఈనెల 26న జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మావూరి శ్రీను డిమాండ్ చేశారు.

జంగారెడ్డిగూడెం టౌన్, నవంబరు 21 : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఈనెల 26న జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మావూరి శ్రీను డిమాండ్ చేశారు. స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయం వద్ద కార్మిక సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం కేవీ రమణ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఎం.జీవరత్నం, ఎస్కే సుభాషిణి, తుమ్మా సోమలింగం, మల్లికార్జునరావు, మాభు. సుభాని, తదితరులు పాల్గొన్నారు.