శ్రీరామ పాదుకలతో ఆలయ ప్రదక్షిణ

ABN , First Publish Date - 2020-03-02T10:31:11+05:30 IST

శ్రీరామ పాదుకలతో ఆలయ ప్రదక్షిణ

శ్రీరామ పాదుకలతో ఆలయ ప్రదక్షిణ

నెల్లిమర్ల, మార్చి 1: రామతీర్థం రామస్వామి దేవస్థానంలో ఈనెల6న శ్రీరామదీక్ష మాల కార్యక్రమాన్ని నిర్వ హించనున్నారు. శ్రీరామ పునర్వసు దీక్ష మాల కోసం వినియోగించనున్న శ్రీరామపాదుకలు, తులసి మాలలు, శ్రీరామ పట్టాభిషేక ప్రతిమలను దేవస్థానానికి మేళతాళాల నడుమ ఆది వారం తీసుకువచ్చారు. ఆలయ అర్చ కులు, దేవస్థానం అధికారులు వాటిని తలపై పెట్టుకుని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అంతకుముందు ఆల యంలో సీతారాములకు  అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, కిరణ్‌, గొడవర్తి నరసింహాచార్యులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాలధారణ చేసే భక్తులు ఈనెల 6న దేవస్థానానికి రావాలని కోరారు. ఈ కార్య క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T10:31:11+05:30 IST