పాముకాటుకు వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-10-01T11:28:25+05:30 IST
నారాయణప్పవలసకి చెందిన పూడి అప్పలస్వామి (64) బుధవారం సాయంత్రం పాముకాటుకు గురై మృతిచెందాడు. మేకలను మేతకు తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా పంతులుగారి పొలం సమీపంలో పాముకాటువేయడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
బొబ్బిలి/రూరల్, సెప్టెంబరు 30 : నారాయణప్పవలసకి చెందిన పూడి అప్పలస్వామి (64) బుధవారం సాయంత్రం పాముకాటుకు గురై మృతిచెందాడు. మేకలను మేతకు తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా పంతులుగారి పొలం సమీపంలో పాముకాటువేయడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికు లు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న కుటుంబ సభ్యులు అప్పలస్వామిని బొబ్బిలి ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేక పోయింది. ఆయనకు భార్య సీతమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చదలవాడ సత్యనారాయణ తెలిపారు.