వైసీపీ నేతల ప్రోద్భలంతో మహిళపై దాడి
ABN , First Publish Date - 2020-12-05T16:00:50+05:30 IST
జిల్లాలోని పూసపాటిరేగ మండలం గుంపాం గ్రామంలో భూ తగాదా నెలకొంది. వైసీపీ నేతలు ప్రొద్భలంతో ఓ మహిళపై వాలంటీర్, వాలంటీర్ భర్త దాడికి తెగబడ్డారు.

విజయనగరం: జిల్లాలోని పూసపాటిరేగ మండలం గుంపాం గ్రామంలో భూ తగాదా నెలకొంది. వైసీపీ నేతల ప్రొద్భలంతో ఓ మహిళపై వాలంటీర్, వాలంటీర్ భర్త దాడికి తెగబడ్డారు. మహాంతి అన్నపూర్ణ అనే మహిళపై కళ్ళల్లో కారం కొట్టి వాలంటీర్ కిల్లారి సంతోషి, భర్త కిలారి ప్రసాద్ దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలపాలైన అన్నపూర్ణను కుటుంబ సభ్యులు విజయనగరం మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.