కూరగాయల ధరలు పైపైకి

ABN , First Publish Date - 2020-03-24T08:02:28+05:30 IST

కరోనా ప్రభావంతో కూరగాయల ధరల ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కరోజులోనే వీటిధరలు రెట్టింపు కావడంతో

కూరగాయల ధరలు పైపైకి

రోజు వ్యవధిలో ధరల పెంపు  సామాన్యుల ఆందోళన


గజపతినగరం, మార్చి 23:  కరోనా ప్రభావంతో కూరగాయల ధరల ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కరోజులోనే వీటిధరలు రెట్టింపు కావడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. శనివారం సాధారణ ధరలకే విక్రయించారు. సోమవారం నాటికి ధరలు పెంచడంతో వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనతా కర్య్పూ వల్ల ఆదివారం ఒక్కరోజు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.  ఈ కారణంతో  ధరలు పెంచారు. వ్యాపారుల సిండికేట్‌ అయి నిలువు దోపిడీ సాగిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. కిలో టమాటా రూ. 20నుంచి ఒక్క రోజు వ్యవధిలో రూ.40కి చేరింది.


ఇదేవిధంగా మిగిలిన కూరగాయల ధరలూ పెరిగిపోయాయి.  వంకాయలు కిలో రూ.50, బెం డకాయలు  రూ.50, దొండకాయలు రూ. 40క్యారెట్‌  రూ.60, బీట్‌ రూట్‌ రూ. 70 ప్రస్తుతం ధరలు పలుకుతున్నాయి.  రూ.10 విక్రయించే ఆకుకూరలను ధరలను పెంచి విక్రయిస్తున్నారు.


ఇలాంటి ధరలైతే ఏం బతకగలమని సామాఽన్య, మధ్య తరగతి కు టుంబాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.  మొన్నటి వరకు రూ. 100 పెడితే సంచి నిండా సరుకులు లభించేవని, ప్రస్తుతం రూ. 500లకు వారం సరిపడా సరుకులు లభించడంలేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో  మరింత ధరలు పెరిగే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ధరలను నియంత్రించాలని  కోరుతున్నారు.

Updated Date - 2020-03-24T08:02:28+05:30 IST