మేజిస్ట్రేట్పై దాడి చేసిన వారిని శిక్షించాలి
ABN , First Publish Date - 2020-07-19T12:14:23+05:30 IST
చిత్తూరు జిల్లాకు చెందిన దళిత మేజిస్ట్రేట్పై దాడి చేసిన వారిని కఠి నంగా శిక్షించాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ
![మేజిస్ట్రేట్పై దాడి చేసిన వారిని శిక్షించాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
దాసన్నపేట, జూలై 18 : చిత్తూరు జిల్లాకు చెందిన దళిత మేజిస్ట్రేట్పై దాడి చేసిన వారిని కఠి నంగా శిక్షించాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సువ్వాడ రవిశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని పద్మావతి నగర్లో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో మేజిస్ర్టేట్కే రక్షణ కరువైందని, ఇక సామా న్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే శిక్షించాలని కోరారు.