రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం
ABN , First Publish Date - 2020-11-01T10:28:47+05:30 IST
రైతుల సంక్షేమానికి సర్కార్ అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. శనివారం చింతాడలో రైతు
బొబ్బిలి రూరల్: రైతుల సంక్షేమానికి సర్కార్ అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. శనివారం చింతాడలో రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి సీఎం జగన్ అనేక పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. పల్లెల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా పురుగు మందులు, ఎరువులు ఇప్పటికే పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు శంబంగి వేణుగోపాలనాయుడు, వైసీపీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.