ప్రజా పోరాటాలే లక్ష్యం
ABN , First Publish Date - 2020-12-27T05:41:38+05:30 IST
ప్రజల పక్షాన పోరాడుతూ ముందుకు వెళ్దామని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. సీపీఐ 95వ వ్యవస్థాపక అవిర్భావ దినోత్సవాన్ని శనివారం నగరంలోని మాక్స్ నగర్, బలిజివీధి, శాంతినగర్ ప్రాంతాల్లో నిర్వహించారు.
![ప్రజా పోరాటాలే లక్ష్యం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020122712103365/12272020001044n16.gif)
సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అశోక్
విజయనగరం దాసన్నపేట, డిసెంబరు 26: ప్రజల పక్షాన పోరాడుతూ ముందుకు వెళ్దామని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. సీపీఐ 95వ వ్యవస్థాపక అవిర్భావ దినోత్సవాన్ని శనివారం నగరంలోని మాక్స్ నగర్, బలిజివీధి, శాంతినగర్ ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, 1925 డిసెంబరు 26న కాన్పూర్లో సీపీఐ అవిర్భవించిందన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు తిండి, బట్ట, గూడు , వైద్యం, విద్య, కనీస అవసరాల కోసం మడమ తిప్పని పోరాటాలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు జగన్నాధం, జీవన్, అప్పలరాజు, గౌరీశంకర్, రాజేష్, సునీల్, సతీష్తో పాటు నాయకులు పాల్గొన్నారు.