ఇళ్ల స్థలాల పంపిణీకి కోడ్ గ్రహణం
ABN , First Publish Date - 2020-03-16T10:12:04+05:30 IST
నామినేషన్ల ప ర్వం ముగిసి, మరో ఆరు రోజుల్లో పోలింగ్ జరగనున్న తరుణంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా ప డ్డాయి. వాటితో పాటే మున్సిపల్ ఎన్నికలను నిలి పివేశారు.
సాలూరు రూరల్, మార్చి 15: నామినేషన్ల ప ర్వం ముగిసి, మరో ఆరు రోజుల్లో పోలింగ్ జరగనున్న తరుణంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా ప డ్డాయి. వాటితో పాటే మున్సిపల్ ఎన్నికలను నిలి పివేశారు. ఎన్నికలు వాయిదా వేసినా కోడ్ అమల్లో ఉం టుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్కుమార్ ఆది వారం ప్రకటించారు. దీంతో ఉగాదికి పంపిణీ చేయా ల్సిన ఇళ్ల పట్టాల పంపిణీపై ఈ ప్రభావముంటుంది. ఇ ళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ సూచించిన విషయం విదితమే.
ప్రస్తుతం ఎన్నికల వాయిదా పడిన కోడ్ అమల్లో ఉం డడంతో ఇళ్ల స్థల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందో లేదోననే సందేహాలు వ్యక్తమవుతు న్నా యి. జిల్లాలో ఇళ్ల స్థలాలివ్వడానికి 59,063 మందిని అ ర్హులుగా గుర్తించారు. వారికి ఇచ్చేందుకు 1813.30 ఎక రాల భూమిని గుర్తించారు. ఇందులో 1375.75 ఎక రాలు ప్రభుత్వ భూమి, 437.83 ఎకరాలు భూసేకరణ ద్వారా సేకరించిన భూమిగా అధికార వర్గాలం టున్నాయి.
ఈ భూమిలో 1072 లే అవుట్లు సి ద్ధం చేస్తున్నారు. పట్టాల పంపిణీకి అధికారులు విరామం లేకుండా పని చేశారు. ఈలోగా ఎన్నికల ప్రకటన వచ్చింది. కో డ్కు వర్తించదని పనులను కొనసాగించారు. రాష్ట్ర ఎ న్నికల కమిషనర్ ప్రకటనతో పట్టాలు పంపిణీ సాగదని భావించారు. కోడ్ మాత్రం ఉండడంతో ప్ర భుత్వం పట్టాల పంపిణీపై ఏ నిర్ణయం తీసుకుం టుందోనని అధికారులు వేచి చూస్తున్నారు.