చట్టాల అమలులో కీలక పాత్ర పోషించాలి
ABN , First Publish Date - 2020-12-06T05:13:19+05:30 IST
మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ, తదితర చట్టాల అమలులో గ్రామీణ, పట్టణ సచివాలయాల పోలీస్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ కోరారు.

డీఎస్పీ సుభాష్
పార్వతీపురం రూరల్, డిసెంబరు 5: మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ, తదితర చట్టాల అమలులో గ్రామీణ, పట్టణ సచివాలయాల పోలీస్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ కోరారు. శనివారం స్థానిక సీఐ కార్యాలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల సచివాలయాల పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు చట్టాల గురించి వివరిస్తూ ప్రజలకు అవసరమైన సేవలందించడంలో పోలీస్శాఖ కీలకంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ వీరబాబు, గ్రామీణ, పట్టణ సచివాలయాల పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. రెండో విడత కరోనా వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎస్పీ సూచించారు.