శంభో శివ శంభో!

ABN , First Publish Date - 2020-12-01T04:54:22+05:30 IST

కార్తీక మూడో సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. అంతటా శివ నామస్మరణ మార్మోగింది.

శంభో శివ శంభో!
విజయనగరలోని పశునాథేశ్వర స్వామి ఆలయంలో బారులు తీరిన భక్తులు


  శివాలయాలకు పోటెత్తిన భక్తులు

  ఘనంగా కార్తీక మూడో సోమవారం పూజలు

  కానరాని కొవిడ్‌ నిబంధనలు

  (ఆంధ్రజ్యోతి బృందం)


కార్తీక మూడో సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. దీంతో శైవక్షేత్రాలు కిటకిటలాడాయి. అంతటా శివ నామస్మరణ మార్మోగింది. వేకువజామునే భక్తజనం ఆలయాల క్యూలైన్లలో బారులుదీరారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో ఉన్న శివయ్యను దర్శించి పులకించిపోయారు. పుష్పాభిషేకం, జలాభిషేకం, రుద్రాభిషేకంతో పాటు, విశేష అర్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం ఆయా శివాలయాలు వద్ద మహిళలు కార్తీకదీపాలు వెలిగించారు. మొత్తంగా అంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఇదిలా ఉండగా కొన్నిచోట్ల కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు. కొందరు మాస్క్‌లు ధరించినా, కనీస భౌతిక దూరం మాత్రం మరించారు. 


 

Updated Date - 2020-12-01T04:54:22+05:30 IST