-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Request to reduce property tax
-
ఆస్తి పన్ను తగ్గించాలని వినతి
ABN , First Publish Date - 2020-12-30T05:57:56+05:30 IST
ఆస్తి పన్నును వెంటనే తగ్గించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు.

విజయనగరం దాసన్నపేట, డిసెంబరు 29: ఆస్తి పన్నును వెంటనే తగ్గించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం 13, 14 సచివాలయాల వద్ద వినతిపత్రం అందించారు. అనంతరం నగరపాలక సంస్థ మేనేజరుకు కూడా వినతిపత్రం అందించారు. ఆస్తి పన్నును క్షేత్రస్థాయిలో ఏ విధంగా పెంచుతున్నారో? అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఆ విషయాన్ని ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. తక్షణమే దీనిపై మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. సంఘ ప్రతినిధులు సన్నిబాబు, రామచంద్రరావు తదితరులు ఉన్నారు.
కరపత్రాల పంపిణీ
బొబ్బిలి: మునిసిపాలిటీల్లో ఆస్తిపన్ను పెంపుదలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పౌరసంక్షేమసంఘం ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. మంగళ వారం పట్టణంలోని పలు కూడళ్లలో సంఘం ప్రతినిధి పొట్నూరు శంకరరావు మాట్లాడుతూ ఆస్తి కాపిటల్ విలువ ఆధారంగా పన్ను విధించాలనుకోవడం అర్థరహితమని తెలిపారు. తక్షణం ఈ చట్ట సవరణలను రద్దు చేయాలన్నారు. తాగునీరు, డ్రైనేజీ చార్జీలను పెంచేందుకు ఇచ్చిన 196, 197 జీవోలను రద్దు చేయాలని, పౌరసౌకర్యాల నిర్వహణఖర్చులన్నింటినీ యూజర్చార్జీల ద్వారా బాదుడు చేయాలనుకోవడం సరికాదని చెప్పారు. చెత్త నిర్వహణ ఖర్చుకు సంబంధించిన చట్టసవరణను కూడా రద్దు చేయాలన్నారు.