నేడు వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన
ABN , First Publish Date - 2020-09-25T10:55:25+05:30 IST
నేడు వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన
![నేడు వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
బొబ్బిలి, సెప్టెంబరు 24 : కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు అఖిలపక్ష నాయకులు తెలిపారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఐఎంఎల్, కాంగ్రెస్, రైతుసంక్షేమ సంఘం, పీకేఎస్ నాయకులు కోట అప్పన్న, మువ్వల శ్రీనివాస్, వేమిరెడ్డి లక్ష్మునాయుడు, తమటాల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.