పోస్టులను భర్తీ చేయాలి
ABN , First Publish Date - 2020-11-27T05:21:45+05:30 IST
గిరిజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరా మ్మూర్తి డిమాండ్ చేశారు.
పార్వతీపురం: గిరిజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం నాయకులు రెడ్డి శ్రీరా మ్మూర్తి డిమాండ్ చేశారు. గురువారం ఐటీడీఏలో 2019లో ఎంపికైన సీఆర్టీ అభ్యర్థులతో ఆకలి యాత్రను నిర్వహించారు. ఎంపికైనప్పటికీ తమకు ఉద్యోగం కల్పిం చకపోవడంతో ఆకలి కేకలు వేస్తున్నాయని, తమను అధి కార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఐటీడీఏ కార్యా లయంలో ఖాళీ ప్లేట్లు పట్టుకుని నిరసన తెలిపారు. అనం తరం డీడీ కిరణ్కుమార్కు వినతిపత్రం సమర్పించి 2019 లో ఎంపికైన అభ్యర్థులతో సీఆర్టీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. పలువురు సీఆర్టీ అభ్యర్థులు, సీపీఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.