కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయాలి

ABN , First Publish Date - 2020-12-30T06:03:08+05:30 IST

కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ పై ప్రజలను అప్రమ త్తం చేయాలని మండ ల ప్రత్యేకాధికారి బి.పాం డురంగ అన్నారు. కొవి డ్‌-19 అవగాహన తీరు తెన్నులపై మంగళవా రం ఎంపీడీవో కార్యాల యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.

కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయాలి
ఎస్‌.కోటలో అధికారులతో సమీక్షిస్తున్న ప్రత్యేకాధికారి

శృంగవరపుకోట : కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ పై ప్రజలను అప్రమ త్తం చేయాలని మండ ల ప్రత్యేకాధికారి బి.పాం డురంగ అన్నారు. కొవి డ్‌-19 అవగాహన తీరు తెన్నులపై మంగళవా రం ఎంపీడీవో కార్యాల యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ ఆర్‌.త్రినాఽథరావు, ఎంఈవో కూర్మారావు, ఏవో సీహెచ్‌ నీలవేణి తదితరులు పాల్గొన్నారు.

గరుగుబిల్లి : కొవిడ్‌-19 రెండో దశ నేపథ్యంలో ప్రజలను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయాలని మండల ప్రత్యేకాధికారి కేఎస్‌ శాస్త్రి సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్‌ వీవీ సన్యాసిశర్మ, ఎంపీడీవో చంద్రరావు, ఈవోపీఆర్డీ ఎల్‌.గోపాలరావు, వైద్యాధికారులు పీఏ ప్రియాంక, కె.అరుణకుమారి, కేకే సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-30T06:03:08+05:30 IST