రైతులకు రూ.10 వేలు అడ్వాన్స్‌ చెల్లించండి

ABN , First Publish Date - 2020-12-27T05:32:13+05:30 IST

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికే మాత్రమే పరిమితం కావడం వల్ల సంక్రాంతికి అడ్వాన్స్‌గా రూ. 10 వేలు చొప్పున ధాన్యం విక్రయించనున్న ప్రతి రైతు ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు డిమాండ్‌ చేశారు.

రైతులకు రూ.10 వేలు అడ్వాన్స్‌ చెల్లించండి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు

ధాన్యం కొనుగోలులో జాప్యం ప్రభుత్వ నిర్లక్ష్యమే: ఎమ్మెల్సీ జగదీష్‌

పార్వతీపురం, డిసెంబరు 26: ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికే మాత్రమే పరిమితం కావడం వల్ల సంక్రాంతికి అడ్వాన్స్‌గా రూ. 10 వేలు చొప్పున ధాన్యం విక్రయించనున్న ప్రతి రైతు ఖాతాకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు డిమాండ్‌ చేశారు. శనివారం టీడీపీ కార్యాలయంలో వీరు విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇంత వరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడం దారుణమని, దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతులు అనేక సమ స్యలు ఎదుర్కొంటున్నారని, ధాన్యం ఇప్పటివరకు కొనుగోలు చేయకపోవడం వల్ల  సం క్రాంతి పండగకు చేతిలో డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలుగుదేశం ప్రభు త్వ హయాంలో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. మోటార్లకు మీటర్లతో అనేక సమస్యలు ఉన్నాయని రైతులు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం మొండిగా మోటా ర్లకు మీటర్లు బిగించడం దారుణమన్నారు. జిల్లాలో రైతులందరికీ ఖాళీ గోనె సంచులు ఇచ్చి రైతుల నుంచి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో సేకరించాలని డిమాండ్‌ చేశారు. కార్య క్రమంలో టీడీపీ నాయకులు కోలా వెంకటరావు, బడే గౌరునాయుడు, దొగ్గ మోహన్‌, గొంగాడ రామ్మూర్తి, తాన్న తిరుపతి, జాగాన రవిశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-27T05:32:13+05:30 IST