ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణ
ABN , First Publish Date - 2020-08-08T09:10:44+05:30 IST
క్లౌడ్ ఆర్కిటెక్ టెక్నాలజీపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణనివ్వనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి ..
విజయనగరం, ఆగస్టు 7: క్లౌడ్ ఆర్కిటెక్ టెక్నాలజీపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆన్లైన్ శిక్షణనివ్వనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పీబీ సాయిశ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఐడీఎస్ ఇన్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి శిక్షణనివ్వనున్నట్టు ప్రకటించారు. సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఎంటెక్, బీటెక్ పూర్తి చేసినవారు... చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆదివారం సాయంత్రం 5గంటల లోగా ఏపీఎస్ఎస్డీసీ.ఐఎన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు 18004252422 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.