రోజుకు వెయ్యి ర్యాపిడ్‌ టెస్టులు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-07-14T10:28:28+05:30 IST

జిల్లాలో కొత్తగా మూడు మిషన్లు, ఆరువేల ర్యాపిడ్‌ ఏంటిజన్‌ కిట్లు వచ్చాయని, వాటి ద్వారా రోజుకు అదనంగా ..

రోజుకు వెయ్యి ర్యాపిడ్‌ టెస్టులు : కలెక్టర్‌

కలెక్టరేట్‌ : జిల్లాలో కొత్తగా మూడు మిషన్లు, ఆరువేల ర్యాపిడ్‌ ఏంటిజన్‌ కిట్లు వచ్చాయని, వాటి ద్వారా రోజుకు అదనంగా వెయ్యి వరకూ ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించనున్నామని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. ఈ టెస్టులతో ఐదు నిమిషాల్లో ఫలితం వస్తుంద న్నారు.  3 వేల పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను సిద్ధం చేశామన్నారు.  సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని, పార్వతీపురంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, అలజంగి జోగారావు కోరారు. జేసీ కిషోర్‌కుమార్‌, ఏఎస్పీ శ్రీదేవిరావు, డీఆర్‌వో వెంకటరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-14T10:28:28+05:30 IST