రోజుకు వెయ్యి ర్యాపిడ్ టెస్టులు : కలెక్టర్
ABN , First Publish Date - 2020-07-14T10:28:28+05:30 IST
జిల్లాలో కొత్తగా మూడు మిషన్లు, ఆరువేల ర్యాపిడ్ ఏంటిజన్ కిట్లు వచ్చాయని, వాటి ద్వారా రోజుకు అదనంగా ..
కలెక్టరేట్ : జిల్లాలో కొత్తగా మూడు మిషన్లు, ఆరువేల ర్యాపిడ్ ఏంటిజన్ కిట్లు వచ్చాయని, వాటి ద్వారా రోజుకు అదనంగా వెయ్యి వరకూ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించనున్నామని కలెక్టర్ హరి జవహర్లాల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో మాట్లాడుతూ.. ఈ టెస్టులతో ఐదు నిమిషాల్లో ఫలితం వస్తుంద న్నారు. 3 వేల పడకలతో కొవిడ్ కేర్ సెంటర్లను సిద్ధం చేశామన్నారు. సంపూర్ణ లాక్డౌన్ విధించాలని, పార్వతీపురంలో కొవిడ్ కేర్ సెంటర్ను త్వరగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, అలజంగి జోగారావు కోరారు. జేసీ కిషోర్కుమార్, ఏఎస్పీ శ్రీదేవిరావు, డీఆర్వో వెంకటరావు పాల్గొన్నారు.