ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ సురేష్బాబు
ABN , First Publish Date - 2020-08-14T19:36:09+05:30 IST
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు దివంగత నేత ..
స్వయంగా బీ ఫారం అందించిన సీఎం జగన్
నెల్లిమర్ల(విజయనగరం): ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు కుమారుడు డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు (సురేష్బాబు)ను వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది. గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్వయంగా సురేష్బాబుకు బీఫారం అందజేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనమే. కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను), కె.హర్షవర్ధన్ రాజు, పి.సంతోష్బాబు తదితరులు పాల్గొన్నారు. సురేష్బాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రేగాన శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.