గ్యాస్ ఆధారిత శ్మశానవాటిక నిర్మాణానికి చర్యలు
ABN , First Publish Date - 2020-12-12T05:07:27+05:30 IST
నగరంలో గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు కమిషనర్ ఎస్ఎస్ వర్మ తెలిపారు.
విజయనగరం రింగురోడ్డు, డిసెంబరు 11: నగరంలో గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు కమిషనర్ ఎస్ఎస్ వర్మ తెలిపారు. శుక్రవారం కొత్తపేటలో శ్మశాన వాటిక పునాదులు, శ్లాబులు వేసేం దుకు సిద్ధంగా ఉన్న వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా బ్లాకుల వారీగా నిర్మాణాలు ఏ విధంగా చేపడుతు న్నారని ఇంజినీరింగు అధికారులను కమిషనర్ వర్మ అడిగి తెలుసుకున్నారు. రూ.95 లక్షల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. కర్మకాండలు, ఛితాభస్మం, మరుగుదొడ్లు, ఆడ్మినిస్ట్రేషన్ బ్లాకులు తదితర విభాగాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈఈ దీలిప్, డీఈలు నర్సింగరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.