గ్యాస్‌ ఆధారిత శ్మశానవాటిక నిర్మాణానికి చర్యలు

ABN , First Publish Date - 2020-12-12T05:07:27+05:30 IST

నగరంలో గ్యాస్‌ ఆధారిత శ్మశాన వాటిక నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ తెలిపారు.

గ్యాస్‌ ఆధారిత శ్మశానవాటిక నిర్మాణానికి చర్యలు
ఇంజినీరింగ్‌ అధికారులకు సూచనలు ఇస్తున్న కమిషనర్‌ వర్మ

విజయనగరం రింగురోడ్డు, డిసెంబరు 11: నగరంలో గ్యాస్‌ ఆధారిత శ్మశాన వాటిక నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్టు కమిషనర్‌ ఎస్‌ఎస్‌ వర్మ  తెలిపారు. శుక్రవారం కొత్తపేటలో శ్మశాన వాటిక  పునాదులు, శ్లాబులు వేసేం దుకు సిద్ధంగా ఉన్న వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా బ్లాకుల వారీగా నిర్మాణాలు ఏ విధంగా చేపడుతు న్నారని ఇంజినీరింగు అధికారులను కమిషనర్‌ వర్మ అడిగి తెలుసుకున్నారు.  రూ.95 లక్షల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. కర్మకాండలు, ఛితాభస్మం, మరుగుదొడ్లు, ఆడ్మినిస్ట్రేషన్‌ బ్లాకులు తదితర విభాగాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈఈ దీలిప్‌, డీఈలు నర్సింగరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

 

 


Updated Date - 2020-12-12T05:07:27+05:30 IST