-
-
Home » Andhra Pradesh » Vizianagaram » Make the farmer conference a succes
-
రైతు సదస్సును విజయవంతం చేయండి
ABN , First Publish Date - 2020-12-28T05:07:27+05:30 IST
మంగళవారం జరగబోయే రైతు సదస్సును విజయవంతం చేయాలని రైతుకూలీ సంఘం నాయకులు ఆది వారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

బెలగాం, డిసెంబరు 27 : మంగళవారం జరగబోయే రైతు సదస్సును విజయవంతం చేయాలని రైతుకూలీ సంఘం నాయకులు ఆది వారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. పార్వతీ పురం మార్కెట్ యార్డు నుంచి జరగబోయే రాస్తారోకోకు పార్వతీపురం మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ డీవీజీ శంకరరావు ముఖ్య అతిథిగా పాల్గొనున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమానికి రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరుకానున్నారన్నారు.