-
-
Home » Andhra Pradesh » Vizianagaram » land allotment
-
గిరిజన ఇంజనీరింగ్ కళాశాలకు 105 ఎకరాలు
ABN , First Publish Date - 2020-11-28T04:01:24+05:30 IST
జిల్లాలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీకి ప్రభుత్వం గ్రీనసిగ్నల్ ఇచ్చింది. కురుపాం మండలం తేకరఖండి వద్ద ఖరారు చేసింది. అక్కడ 105.32 ఎకరాల భూమిని కాలేజీ నిర్మాణానికి కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆమరావతిలో శుక్రవారం మంత్రివర్గ సమావేశం సీఎం జగన అధ్యక్షతన జరిగింది.

కొమరాడ మండలం తేకరఖండి వద్ద కేటాయింపు
రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీకి ప్రభుత్వం గ్రీనసిగ్నల్ ఇచ్చింది. కురుపాం మండలం తేకరఖండి వద్ద ఖరారు చేసింది. అక్కడ 105.32 ఎకరాల భూమిని కాలేజీ నిర్మాణానికి కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆమరావతిలో శుక్రవారం మంత్రివర్గ సమావేశం సీఎం జగన అధ్యక్షతన జరిగింది. జిల్లాకు సంబంధించి గిరిజన ఇంజనీరింగ్ కాలేజీకి ఏర్పాటుకు భూములు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇక్కడ అధికారులు స్థల పరిశీలన పూర్తిచేశారు. కొండ పక్కన విశాలమైన ప్రాంతం కావడంతో ఇక్కడ ఎంపిక చేశారు. కీలక విభాగాలతో పాటు వసతిగృహాలు, క్రీడా సముదాయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు. భూ కేటాయింపు నేపథ్యంలో పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది.