‘ఆసరా’ వారోత్సవాలకు కరోనా అడ్డు కాదా..?
ABN , First Publish Date - 2020-09-19T11:08:32+05:30 IST
కరోనా నేపథ్యంలో వినాయకచవితితో పాటు అనేక ఉత్సవాలకు అడ్డుచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా వారోత్సవాలను ఎలా నిర్వహిస్తోందని ఎమ్మెల్సీ గుమ్మి
ఎమ్మెల్సీ సంధ్యారాణి
సాలూరు, సెప్టెంబరు 18: కరోనా నేపథ్యంలో వినాయకచవితితో పాటు అనేక ఉత్సవాలకు అడ్డుచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా వారోత్సవాలను ఎలా నిర్వహిస్తోందని ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి ప్రశ్నించారు. స్థానిక విలేకర్లతో ఆమె శుక్రవారం ఫోన్లో మాట్లాడారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,200 మంది కరోనాతో మృత్యువాత పడ్డారని చెప్పారు. పెళ్లిళ్లు, కార్యక్రమాలకు అనేక ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పేరుతో వేలాది మందితో సమావేశాలు ఏర్పాటుచేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆమె ఆరోపించారు.