రైతు ఆత్మహత్యలు బాధాకరం
ABN , First Publish Date - 2020-12-31T05:23:28+05:30 IST
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 500 మందికి పైగా రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రాంప్రసాద్, విశాఖ పార్లమెంటు రైతు విభాగం అధ్యక్షుడు తిక్కాన చినదేముడు ఆవేదన వ్యక్తం చేశారు.
![రైతు ఆత్మహత్యలు బాధాకరం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020123011515471/12302020235307n36.gif)
శృంగవరపుకోట, డిసెంబర్ 30: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 500 మందికి పైగా రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరమని ఎస్కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రాంప్రసాద్, విశాఖ పార్లమెంటు రైతు విభాగం అధ్యక్షుడు తిక్కాన చినదేముడు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు చేస్తున్న అన్యాయంపై బుధవారం స్థానిక దేవీబొమ్మ కూడలిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద రైతులు, కార్యకర్తలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పూలమాల వేసి విగ్రహానికి వినతిపత్రం అందించారు.