మోసం చేశారు

ABN , First Publish Date - 2020-03-16T10:15:16+05:30 IST

ఎన్నికల అధికారులు సైతం అధికార పార్టీతో కుమ్మకై తన నామినేషన్‌ను విత్‌డ్రా అయ్యేలా

మోసం చేశారు

విజయనగరం (ఆంధ్రజ్యోతి), మార్చి15: ఎన్నికల అధికారులు సైతం అధికార పార్టీతో కుమ్మకై తన నామినేషన్‌ను విత్‌డ్రా అయ్యేలా కుట్ర పన్ని పోటీనుం చి దూరం చేశారని పాచిపెంట   ఎంపీటీసీ-3 టీడీపీ అ భ్యర్థి బెవర రామకృష్ట ఆరోపించారు. ఆదివారం   క లెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ,  ఎంపీటీసీ అభ్యర్థిగా పార్టీ బీ ఫారంతో నామినేషన్‌ వేసినట్లు చెప్పారు. 14వ తేదీ సాయంత్రం పొలంలో పనిచేస్తుండగా కొంతమంది వచ్చి నామినే షన్‌లో కొన్ని సంతకాలు లేవు...ఆర్‌ఓ రమ్మంటున్నారంటూ తీసుకువెళ్లారన్నారు.


మండల పరిషత్‌ కార్యాల యంలో ఈ ప్రక్రియ సాయంత్రం 5.30కి జరిగిందని, త ర్వాత రాత్రి 8 గంటలకు ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకున్న అధికారులు జా బితా ప్రకటిం చారన్నారు.  తాను మోసపోయానని తెలుసుకుని పార్టీ మండల అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌కు జరిగిన విషయాన్ని తెలిపానన్నారు. ఈస్థితిలో తన నామినేషన్‌ అంగీకరించాలని కోరుతున్నట్లు కలెక్టర్‌ యం. హరిజవహర్‌లాల్‌నుకోరారు.


ఉపసంహరణ చేసుకునేటప్పుడు వీడియో తీయలేదన్నారు.   అధికారులు అధికార పార్టీనేతలకు అండగా నిలుస్తూ కుట్రపూరితమైన పనులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బంజ్‌దేవ్‌ ఈసందర్భంగా ఆరోపించారు. దీనిపై దర్యాప్తుచేసి  అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.  కలెక్టర్‌ను కలిసిన వారిలో  మండల తెలుగుయువత అధ్య క్షుడు బుజ్జి ఉన్నారు.

Updated Date - 2020-03-16T10:15:16+05:30 IST