సజావుగా డిపార్ట్మెంటల్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-11-22T04:54:28+05:30 IST
ఏపీపీఎస్సీ ద్వారా జిల్లాలో డిపార్ట్మెంటల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
కలెక్టరేట్:
ఏపీపీఎస్సీ ద్వారా జిల్లాలో డిపార్ట్మెంటల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. శనివారం తొలిరోజు 92 శాతం హాజరు నమో దైనట్లు డీఆర్వో గణపతిరావు చెప్పారు. ఉదయం పరీక్షకు 791 మంది రావాల్సి ఉండగా 727 మంది, మధ్యాహ్నం 791 మందికి 733 మంది అభ్యర్థులు హాజరైనట్లు చెప్పారు. గాజులరేగలో ఉన్న సీతం ఇంజినీరింగ్ కళాశాలను ఆయన సందర్శించారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.