270 హెక్టార్లలో పంటలకు నష్టం
ABN , First Publish Date - 2020-03-24T08:07:42+05:30 IST
మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు సుమారు 270 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటి ల్లినట్లు
మెంటాడ, మార్చి 23: మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు సుమారు 270 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటి ల్లినట్లు క్షేత్రస్థాయిలో అంచనా వేశామని ఏవో పి.వి. మల్లికార్జునరావు తెలిపారు. 22 గ్రామాల పరిధిలో 258 మందికి చెందిన 116 హెక్టార్ల లో పంట నష్టం జరిగిందన్నారు. వరి 141 హె క్టార్లలో 9 మందికి చెందిన పంట, నువ్వు పం ట సుమారు రెండు హెక్టార్లలో నష్టం వాటి ల్లినట్లు చెప్పారు. ఐదు గ్రామాల్లో సుమారు 10 ఎకరాల్లో అరటి నేలకొరిగిందన్నారు. మరికొన్ని గ్రామాల్లో పంట నష్టం అంచనా వేస్తున్నామని అన్నారు.బాధిత రైతులు తమకు సమాచారం అందివ్వాలని కోరారు.