వలసకూలీలకు కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-24T08:27:26+05:30 IST

మండలం తాటిపూడి ఏపీఆర్‌జెసీ కళాశాల లో ఉన్న పునరావాస కేంద్రంలోని 70 మంది వలస కూలీలకు శని వారం వైద్య ..

వలసకూలీలకు కరోనా పరీక్షలు

శృంగవరపుకోట రూరల్‌, మే 23: మండలం తాటిపూడి ఏపీఆర్‌జెసీ కళాశాల లో ఉన్న పునరావాస కేంద్రంలోని 70 మంది వలస కూలీలకు శని వారం వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తహ సీల్దార్‌ ఎల్‌. రామా రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సచి వాలయ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఫ మఽథనాపురం(గంట్యాడ):  మధనాపురంలో ఆదర్శ పాఠశాలలోని పునరా వాస కేంద్రంలో ఉన్న 50 మంది వసల కూలీలకు వైద్యుడు సిద్ధార్ధ ఆధ్వర్యంలో శనివారం కరోనా పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో  తహసీల్దార్‌ స్వర్ణకుమార్‌, వైద్యులు అపురుజాసుల్తాన్‌, ఈశ్వరీదేవి, ఈవో ప్రభాకర్‌రావులు పాల్గొన్నారు. ఫ బాడంగి : స్థానిక జీఎంసీ బాలయోగి కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో 97 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తహసీల్దార్‌ ఆదిలక్ష్మి తెలిపారు. శనివారం వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహించామన్నారు. 

Updated Date - 2020-05-24T08:27:26+05:30 IST