పైడిమాంబ దేవస్థానం ఉద్యోగులకు నేడు కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2020-10-19T10:18:18+05:30 IST
పైడిమాంబ దేవస్థానం ఉద్యోగులకు నేడు కరోనా పరీక్షలు

విజయనగరం రూరల్, అక్టోబరు 18: సిరిమానోత్సవం ప్రక్రియలో పాల్గొనున్న పైడిమాంబ దేవస్థానం ఉద్యోగులు, ఇతర ప్రాంతాల నుంచి విధులకు హాజరుకానున్న సిబ్బందికి సోమవారం కరోనా పరీక్షలు చేయనున్నట్లు ఆలయ ఈవో జీవీఎస్ సుబ్రహ్మణ్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పైడిమాంబ దేవస్థానం (చదురుగుడి) ఎదుట ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి, మాస్క్ ధరించి ఈ పరీక్షలకు హాజరుకావాలని కోరారు.