సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-12-29T05:42:06+05:30 IST
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిం చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు.
పరవాడ, డిసెంబరు 28: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిం చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. మండలంలో సోమవారం బొద్దపువానిపా లెం, పరవాడ, వెన్నెలపాలెం, పి.భోనంగి, కలపాక, గొర్లెవానిపాలెం గ్రామాల్లో లబ్ధిదారులకు ఆయన ఇళ్ల స్థల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి ఎన్.కోటేశ్వరరావు, వైసీపీ నేతలు పైలా శ్రీనివాసరావు, చుక్క రామునాయుడు, అప్పలనాయుడు, సన్యాసిరాజు, జయరాం, చిన్నారావు, అప్పారావు, కనకారావు, గోపాలకృష్ణ, సన్యాసిరావు పాల్గొన్నారు.