ధన్‌బాద్‌,-అలెప్పీ ప్రత్యేక రైలు షెడ్యూల్‌ మార్పు

ABN , First Publish Date - 2020-12-26T05:30:00+05:30 IST

ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రవేశపెడుతున్న ధన్‌బాద్‌, అలెప్పీ (బొకారో) ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు షెడ్యూల్‌ను సవరించినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

ధన్‌బాద్‌,-అలెప్పీ ప్రత్యేక రైలు షెడ్యూల్‌ మార్పు

జనవరి ఎనిమిది నుంచి అందుబాటులోకి..

విశాఖపట్నం, డిసెంబరు 26: ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రవేశపెడుతున్న ధన్‌బాద్‌, అలెప్పీ (బొకారో) ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు షెడ్యూల్‌ను సవరించినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఈ ప్రత్యేక రైలు జనవరి ఒకటి నుంచి అందుబాటులో వుంటుందని ప్రకటించామని, అయితే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రాజమండ్రి, విజయవాడ రైల్వే స్టేషన్ల మధ్య ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెల ఎనిమిది నుంచి పట్టాలెక్కనుందని పేర్కొన్నారు. 03351 నంబరు గల రైలు ఈ నెల ఎనిమిదన ఉదయం 11:40 గంటలకు ధన్‌బాద్‌లో బయలదేరి మర్నాడు ఉదయం 8:15 గంటలకు విశాఖ చేరి, తిరిగి ఇక్కడ నుంచి 8:35 గంటలకు బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 3:25 గంటలకు అలెప్పీ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 03352 నంబరు గల రైలు జనవరి 11న ఉదయం 6:00 గంటలకు అలెప్పీలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 1:10 గంటలకు విశాఖ చేరి తిరిగి ఇక్కడ నుంచి 1:30 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 10:20 గంటలకు ధన్‌బాద్‌ చేరుతుంది. ప్రయాణికులు గమనించాలని కోరారు. 


Updated Date - 2020-12-26T05:30:00+05:30 IST