వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2020-12-13T05:55:58+05:30 IST

ప్రసన్నగిరిపై గల వెంకటేశ్వర వినాయకస్వామి దేవస్థానంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి.

వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు
ప్రసన్నగిరిపై ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న వేద పండితులు

అక్కిరెడ్డిపాలెం: బీహచ్‌పీవీ ప్రసన్నగిరిపై గల వెంకటేశ్వర వినాయకస్వామి దేవస్థానంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా వెంకటేశ్వరస్వామి ఆలయంలో దేవస్థానం ప్రధానార్చకులు కె.వెంకట జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో వెదపండితులు వేంకటేశ్వరస్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. సాయింత్రం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిపై వుంచి ప్రసన్నగిరిపై తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఈవో కీర్తి శ్రీనివాస్‌, మాజీ చైర్మన్‌ మల్లేశ్వరరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2020-12-13T05:55:58+05:30 IST