-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » vsp news
-
మరో 303
ABN , First Publish Date - 2020-10-07T11:10:41+05:30 IST
జిల్లాలో మంగళవారం మరో 303 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం 52,002 అయ్యాయి.

8 52,002కు చేరిన కరోనా కేసులు
విశాఖపట్నం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం మరో 303 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం 52,002 అయ్యాయి. ఇందులో 48,409 మంది కోలుకోగా, మరో 3,169 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ బారినపడిన మరో నలుగురు మృతిచెందడంతో మొత్తం కొవిడ్ మరణాలు 424కు చేరాయి.
ఆరిలోవలో 7..: ఆరిలోవలోని రిఫరల్ ఆస్పత్రిలో 161 మందికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
జీవీఎంసీ 98వ వార్డులో 3..: సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో 98వ వార్డుకు చెందిన 94 మందికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది.
69వ వార్డులో 2..: 69వ వార్డు పరిధిలోని నాయుడుతోట దుర్గానగర్, రవినగర్కు చెందిన ఒక్కొక్కరికీ వైరస్ సోకింది.
పాడేరు మన్యంలో 1,568 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 49 మందికి వైరస్ నిర్ధారణ అయ్యిందని ఏడీఎంహెచ్వో డాక్టర్ కె.లీలాప్రసాద్ తెలిపారు.
నర్సీపట్నం మునిసిపాలిటీల్లో 21 మంది, రాంబిల్లి, దిమిలి పీహెచ్సీ పరిధిలో పది మంది, కోటవురట్లలో ఏడుగురికి, పాయకరావుపేటలో ఆరుగురికి, అనకాపల్లి జోన్ పరిధిలో ముగ్గురికి వైరస్ నిర్ధారించారు.